హెవీవెయిట్ పారా పవర్లిఫ్టింగ్లో మూడో స్థానం
లైట్వెయిట్ విభాగంలో అశోక్ మాలిక్కు నాలుగో స్థానం
గ్లాస్గోలో జరుగుతున్న Commonwealth Games 2026లో భారత్కు మరో పతకం లభించింది. పురుషుల హెవీవెయిట్ పారా పవర్లిఫ్టింగ్ విభాగంలో జండూ కుమార్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అత్యంత ఉత్కంఠగా సాగిన పోటీలో ఆయన 130.9 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు.
ఈ విభాగంలో నైజీరియాకు చెందిన Riluwan Idris 132.8 పాయింట్లతో స్వర్ణ పతకం గెలుచుకోగా, ఇంగ్లాండ్కు చెందిన Matthew Harding 131.0 పాయింట్లతో రజత పతకం సాధించాడు. జండూ కుమార్ వెండి పతకానికి కేవలం 0.1 పాయింట్ తేడాతో వెనుకబడి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.
ఈ పతకంతో గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో పారా క్రీడల్లో భారత్ విజయ పరంపర కొనసాగింది. ఒత్తిడిని తట్టుకుని జండూ నిలకడైన ప్రదర్శనతో పోడియంపై చోటు దక్కించుకున్నాడు.
బీహార్లోని నలందా జిల్లా హర్నౌత్కు చెందిన జండూ కుమార్ 1997 జనవరి 1న జన్మించాడు. పుట్టుకతోనే పోలియో బారిన పడ్డాడు. కూరగాయల వ్యాపారి కుమారుడైన ఆయన ఆర్థిక, శారీరక ఇబ్బందులను అధిగమించి క్రీడల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
2017లో పారా అథ్లెటిక్స్లో F55 షాట్పుట్, డిస్కస్ త్రో విభాగాల్లో తన క్రీడా ప్రయాణాన్ని ప్రారంభించాడు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు పతకాలు గెలిచాడు.
జిమ్లో శక్తి సాధన చేస్తూ పవర్లిఫ్టింగ్పై ఆసక్తి పెరగడంతో, రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్లో వచ్చిన సూచన మేరకు పారా పవర్లిఫ్టింగ్కు మారాడు.
ఇక ఇదే రోజు జరిగిన పురుషుల లైట్వెయిట్ పారా పవర్లిఫ్టింగ్లో అశోక్ మాలిక్ పతకానికి అతి చేరువలో నిలిచాడు. 200 కిలోల బెస్ట్ లిఫ్ట్ నమోదు చేసినప్పటికీ మొత్తం 143.8 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.
మలేషియాకు చెందిన Bonnie Bunyau Gustin 153.5 పాయింట్లతో కాంస్య పతకం గెలిచి అశోక్ మాలిక్ను వెనక్కి నెట్టాడు.
ఇంగ్లాండ్కు చెందిన Mark Swan 222 కిలోల అత్యుత్తమ లిఫ్ట్తో 153.9 పాయింట్లు సాధించి స్వర్ణ పతకం అందుకున్నాడు.
నైజీరియాకు చెందిన పలుమార్లు పారాలింపిక్ పతక విజేత Roland Ezuruike కూడా 153.9 పాయింట్లు సాధించినప్పటికీ కౌంట్బ్యాక్ ఆధారంగా రజత పతకంతో సరిపెట్టుకున్నాడు.
ఈ స్వర్ణ పతకమే గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో తొలి గోల్డ్ మెడల్గా నమోదైంది.
భారత్కు చెందిన మరో క్రీడాకారుడు Parmjeet Kumar 135.6 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు.



