2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ వార్షిక పరీక్షల్లో నిజామాబాద్ జిల్లా మంచి ఫలితాలను నమోదు చేసింది. రెండవ సంవత్సరం జనరల్ విభాగంలో 66.19% ఉత్తీర్ణత నమోదవగా, మొదటి సంవత్సరం 56.64% పాస్ శాతం నమోదైంది.

జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం, రెండవ సంవత్సరం జనరల్ విభాగంలో 13,876 మంది హాజరై 9,187 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 76.56% ఉత్తీర్ణతతో బాలురపై ఆధిపత్యం చాటగా, బాలురు 53.63% మాత్రమే సాధించారు.మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో 15,547 మంది హాజరై 8,806 మంది పాస్ అయ్యారు. ఇందులో బాలికలు 67.36% ఉత్తీర్ణత సాధించగా, బాలురు 42.98% మాత్రమే సాధించారు.ఒకేషనల్ విభాగంలో రెండవ సంవత్సరం 67.68%, మొదటి సంవత్సరం 49.69% ఉత్తీర్ణత నమోదైంది. ఈ విభాగంలో కూడా బాలికలు గణనీయమైన ఫలితాలు సాధించారు.గత సంవత్సరం తో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరగడం విశేషం. 2024-25లో రెండవ సంవత్సరం 58.21% ఉండగా, ఈసారి 66.19%కి పెరిగింది.మొత్తంగా జిల్లాలో ఇంటర్ ఫలితాల్లో బాలికలు మరోసారి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాయి.
