నరసరావుపేటలో కుటుంబం ఆత్మహత్య కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ఒక లాడ్జిలో నాదెండ్ల మండలం సాతులూరు కు చెందిన మూడేళ్ల కూతురుతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఘటనలో తల్లి శంకర కుమారి (30) మూడేళ్ల చిన్నారి ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డాక్టర్ గోపి చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబం మొత్తం సామూహికంగా ఆత్మహత్య కు పాల్పడటంతో బంధువులు శోకంలో మునిగిపోయారు.
