రాపూరు పంచాయతీ పరిధిలో జనం కోతులు, కుక్కల సమస్యతో వణికిపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ రాపూరు కొఆప్షన్ సభ్యులు సయ్యద్ సయీద్ నెల్లూరు జిల్లా పంచాయతీ అధికారి (DPO) వసుమతికి వినతిపత్రం అందజేశారు.

రాపూరులోని అన్ని గ్రామాల్లో కోతుల గుంపులు ఇళ్లపై పడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడమే కాకుండా, ప్రజలపై దాడులు చేస్తున్నాయని ఆయన వివరించారు. అలాగే పిచ్చి కుక్కల బెడద కూడా తీవ్రంగా ఉందన్నారు. ఈ వినతిపై సానుకూలంగా స్పందించిన డి.పి.ఓ వసుమతి, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
