Vijayawadaలోని ఆంత్రా లూక్స్ కన్వెన్షన్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు హాస్య జల్లులతో సందడి చేశాయి. ఈ కార్యక్రమాన్ని N. Chandrababu Naidu జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

కార్యక్రమంలో స్పీకర్ Chintakayala Ayyannapatrudu, డిప్యూటీ స్పీకర్ K. Raghurama Krishnam Rajuతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

మహిళా ప్రజాప్రతినిధులు ఆప్కో చేనేత వస్త్రాలు ధరించి స్టేజిపై క్యాట్వాక్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నేతలు హాస్య నాటికలు, ప్రభుత్వ పథకాలపై రూపకాలు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ హాస్యం ఒక దివ్య ఔషధమని, ప్రజాప్రతినిధులు కుటుంబంలా కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.

