మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు అర్ధరాత్రి దాడి చేయడంతో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

భయంతో బాధిత విద్యార్థులు తమ గ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులకు విషయం తెలియజేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.దీంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్నాకు దిగారు. పాఠశాలలో విద్యార్థుల మధ్య గొడవలు జరుగుతున్నా ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
