1.93 మీటర్ల జంప్తో జాతీయ రికార్డు బద్దలు
కామన్వెల్త్ గేమ్స్కు అర్హత సాధించిన 19 ఏళ్ల అథ్లెట్ Pooja Singh
హైదరాబాద్: భారత అథ్లెటిక్స్లో 14 ఏళ్లుగా చెక్కుచెదరని హైజంప్ రికార్డుకు Pooja Singh పలికింది. హాంకాంగ్లో జరిగిన ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్-2026లో 1.93 మీటర్ల ఎత్తు దూకి స్వర్ణ పతకం సాధించింది. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ)లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ (బీపీఈఎస్) రెండో సంవత్సరం చదువుతున్న ఆమె, ఈ ప్రదర్శనతో భారత మహిళల హైజంప్లో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది.
పూజా 14 ఏళ్లుగా కొనసాగుతున్న భారత అండర్-20 జాతీయ రికార్డును అధిగమించింది. గత ఏడాది దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా చాంపియన్షిప్స్లో 1.89 మీటర్ల జంప్తో స్వర్ణం గెలిచిన ఆమె, ఇప్పుడు 1.93 మీటర్లతో తన సొంత రికార్డును మరింత మెరుగుపర్చుకుంది.
రికార్డుల రాణిగా పూజా
భారత మహిళల హైజంప్లో పూజా ఆధిపత్యం కొనసాగుతోంది. అండర్-17, జూనియర్, అండర్-20, సీనియర్ జాతీయ రికార్డులు దాదాపు అన్నీ ఆమె పేరిటే ఉన్నాయి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఆల్ ఇండియా ఇంటర్-యూనివర్సిటీ గేమ్స్లో కూడా ఆమె వరుస విజయాలు సాధిస్తూ కొత్త ప్రమాణాలు నెలకొల్పుతోంది.
హర్యానా గ్రామం నుంచి ఆసియా శిఖరానికి
హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలో చిన్న గ్రామంలో జన్మించిన పూజా, సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఆమె తండ్రి రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు.ఎన్నో సంవత్సరాల పట్టుదల, త్యాగం, కఠోర సాధన ఆమెను ఆసియా వేదికపై విజేతగా నిలిపాయి.
ALSO READ

