నేను ఎలాంటి తప్పు చేయలేదు మొయినాబాద్ ఘటనపై MP మహేష్

March 16, 2026 12:06 PM

మొయినాబాద్ ఘటనలో తనపై వచ్చిన ఆరోపణలపై ఏలూరు ఎంపీ Putta Mahesh Yadav స్పందించారు. వీడియో సందేశం ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.

స్నేహితుడు డిన్నర్‌కు ఆహ్వానించడంతోనే Moinabadకు వెళ్లానని తెలిపారు. అక్కడ ఎటువంటి తప్పు చేయలేదని, తాను ఎలా ఉండే వ్యక్తినో ఏలూరు ప్రజలకు, స్నేహితులకు, పార్టీ నాయకులకు తెలుసని అన్నారు.ఈ ఘటనపై మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను నమ్మవద్దని కోరారు. త్వరలోనే ప్రజల ముందుకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media