SC కుటుంబాలకు అండగా నిలుస్తూ తమ ఉదారతను చాటుకున్నారు చెన్ను సోదరులు. Rapur మండలం Gonupalli పంచాయతీ పరిధిలోని రాంకూరు గ్రామంలో ఆరుగురు ఎస్సీ కుటుంబాలకు ఇళ్ల స్థల సమస్య తలెత్తడంతో వారు ముందుకు వచ్చి సహాయం చేశారు.
పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ Chennu Tirupal Reddy మరియు టీడీపీ మండల అధ్యక్షుడు Chennu Ashok Reddy బాధిత కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా వేరే స్థలం చూపించారు.అయితే కేటాయించిన స్థలంలో పెద్ద గుంతలు ఉండటంతో నివాసానికి అనుకూలంగా లేకపోవడంతో చెన్ను సోదరులు తమ సొంత నిధులతో మట్టిని తరలించి యంత్రాల సహాయంతో భూమిని చదును చేయించారు. ఎవరూ పట్టించుకోని సమయంలో రాజకీయాలకు అతీతంగా సహాయం చేసినందుకు లబ్ధిదారులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
